Panipuri : పానీపూరీ ఆ చిన్నారుల పాలిట యమపాశమైంది. అన్నదమ్ముల ప్రాణాలు బలి తీసుకుంది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఈ కుటుంబ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ విషాదకర ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది.
10 ఏళ్ల రామకృష్ణ, 6 ఏళ్ల విజయ్ అన్నదమ్ములు. చిరుతిండి తినాలని ఆశ పడ్డారు. బుధవారం రాత్రి పానీ పూరీ తిన్నారు. వెంటనే కడుపునొప్పితో విలవిలలాడారు. బాధతో అల్లాడిపోయారు. ఆ చిన్నారులను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రాణాలు దక్కలేదు. ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసెలా రోదిస్తున్నారు.
చిన్నారుల మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.