Tamilisai Soundararajan : ఓటు వేసి గెలిపించకుంటే.. చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. అదేమి ఎన్నికల ప్రచారం అంటూ తీవ్రంగా స్పందించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. హుజూరాబాద్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. జాతీయ ఓటరు దినోత్సవంలో పాల్గొన్న తమిళిసై.. ఓటర్లను బెదిరించేవారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుజూరాబాద్ నుంచి పోటీ చేసిన కౌశిక్రెడ్డి.. ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. తాను గెలిస్తే విజయయాత్రకు రండి.. ఓడితే తన ఫ్యామిలీ శవయాత్రకు రండి అంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు అప్పట్లోనే కలకలం రేపాయి. ఓట్లు అడిగే విధానం ఇదేనా అంటూ ప్రశ్నలు వినిపించాయి. ఎన్నికల్లో కౌశిక్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికీ ఆయన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ వ్యాఖ్యలపై చర్చ జరుగుతూనే ఉంది. అలాంటి వారిపై ఎన్నికల సంఘం గట్టి చర్యలు తీసుకోవాలి కోరారు గవర్నర్ తమిళిసై.కౌశిక్రెడ్డి శవయాత్ర వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఓటరు దినోత్సవం సాక్షిగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.
.
.