ఇండియాలోని బ్రిటీష్ హై కమీషనర్ అలెక్స్ ఎల్లిస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. సెక్రటేరియట్లో సీఎంతో చర్చలు జరిపారు. బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ తెలంగాణ గారెత్ విన్ ఓవెన్, రాజకీయ ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్, MEA బ్రాంచ్ సెక్రటేరియట్ హెడ్ జె. స్నేహజతో పాటు పలువురు ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణ, బ్రిటీష్ వాణిజ్య సంబంధాలపై ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లో మూసీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాలికలు రూపొందిస్తున్నట్లు అలెక్స్ ఎల్లిస్తో తన ఆలోచనలు పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో సీఎం థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు.