Aam Aadmi Party : పంజాబ్లో తాము ఒంటరిగానే లోక్సభ ఎన్నికలకు వెళ్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్తో పొత్తుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేసిన కాసేపటికే ఆప్ తమ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
Aam Aadmi Party : పంజాబ్లో తాము ఒంటరిగానే లోక్సభ ఎన్నికలకు వెళ్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్తో పొత్తుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేసిన కాసేపటికే ఆప్ తమ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
కేంద్రంలోని అధికార ఎన్డీయే (NDA)పై ఉమ్మడి పోరు కోసం జట్టుగా ఏర్పడిన విపక్షాల ‘ఇండియా కూటమికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ (West Bengal)లో సార్వత్రిక ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కూడా కాంగ్రెస్కు షాకిచ్చింది. పంజాబ్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడించింది.
మమతా బెనర్జీ ప్రకటనపై పంజాబ్ సీఎం భగవంత్మాన్ స్పందించారు. హస్తం పార్టీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. పంజాబ్లో మొత్తం 13 లోక్సభ స్థానాల్లో ఆప్ బరిలోకి దిగుతుందని వెల్లడించారు. ఇందుకోసం 40 మంది అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేశామన్నారు. సర్వే చేసిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.