Jallikattu : తమిళనాడులోని మధురైలో జల్లికట్టు స్టేడియాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. దేశ చరిత్రలో జల్లికట్టు కోసం తొలిసారి ప్రత్యేకంగా స్టేడియం నిర్మించారు. స్టేడియం ప్రారంభమైన వెంటనే జల్లికట్టు మొదలుపెట్టేశారు. 600 ఎద్దులు రంగంలోకి దిగాయి. ఈ పోటీల్లో 400 మంది యువకులు పోటీ పడ్డారు.
44 కోట్ల వ్యయంతో జల్లికట్టు స్టేడియాన్ని స్టాలిన్ సర్కార్ నిర్మించింది. 5 వేల మందికిపైగా సీటింగ్ కెపాసిటీతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించారు. ఈ స్టేడియానికి మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎం .కరుణానిధి పేరు పెట్టారు. ఈ స్టేడియంలో వీఐపీ సీటింగ్, మ్యూజియం, బుల్ షెడ్, వెటర్నరీ డిస్పెన్సరీ, ఆరోగ్య సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు.