EPAPER

Fire To Chilli Crop : పల్నాడు జిల్లాలో దుండగులు దుశ్చర్య.. మిరప పంటకు నిప్పు..

Fire To Chilli Crop :  పల్నాడు జిల్లాలో దుండగులు దుశ్చర్య.. మిరప పంటకు నిప్పు..

Fire To Chilli Crop : పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంటలో మిర్చి పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. పంట తగలబడటంతో రూ. 2.5 లక్షల ఆస్తి నష్టం కలిగిందని రైతు కన్నీటి పర్యంతమయ్యారు.


పల్లెగుంటలో దీకొండ రమణ మిర్చి పంట సాగు చేశారు. మిర్చిని కల్లంలో ఆరబోసి రాత్రి ఇంటికి వెళ్లారు. ఉదయం వచ్చి చూసే సరికి పంట దగ్ధమైంది. దీంతో ఆ రైతు భావోద్వేగానికి లోనయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించటంతో కల్లంలో ఆరబోసిన 15 క్వింటాళ్ల ఎండు మిర్చి పూర్తిగా కాలి బూడిదైందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాత్రి సమయంలో దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని బాధితుడు రమణ అనుమానం వ్యక్తం చేశారు. తనకు తగిన న్యాయం జరిగేలా చూడాలని బాధిత రైతు ప్రభుత్వానికి వేడుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.


Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×