TRS Public Notice : మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుతో టీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సంఘానికి వినతిపత్రం కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ తరఫున పబ్లిక్ నోటీసు జారీ చేశారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో ఎన్నికల కమిషన్కు తెలపాలని నోటీసులో పేర్కొన్నారు.
ఇటీవళ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా వెళ్తుందని ప్రకటించిన విషయం తెలిసింది. బీఆర్ఎస్ ప్రకటనకు ముందు కేసీఆర్ దేశవ్యాప్తంగా అనేక మంది బీజేపీ యేతర జాతీయ, రాష్ట్ర పార్టీల నాయుకులను కలిశారు. కుమార స్వామి, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్ లాంటి జాతీయ నాయుకులతో మంతనాలు జరిపారు. నిన్న మునుగోడులో టీఆర్ఎస్ 10వేల మెజార్టీతో గెలుపొందడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు పార్టీ శ్రేణులందరిలో జాతీయ రాజకీయాలపై మరింత జోష్ పెరిగింది. మునుగోడును కైవసం చేసుకునేందుకు బీజేపీ జాతీయ స్థాయిలో వ్యూహాలు రచించింది. మునుగోడు గెలుపుతో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఓ మెట్టు ఎక్కినట్లు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.