Jayalalithaa’s Gold : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణకు చేసిన ఖర్చులకు తమిళనాడు ప్రభుత్వం.. కర్ణాటక సర్కారుకు రూ.5 కోట్లు పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఇక జయలలిత ఆభరణాలను వేలం వేయాలన్న పిటిషనర్లు.. జయలలిత మేనకోడలు, మేనల్లుడు జె.దీప, జె.దీపక్ దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. స్వాధీనం చేసుకున్న ఈ విలువైన ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించింది. ఆభరణాలను వేలం వేయడానికి బదులుగా తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం సబబేనని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అన్నారు. కేంద్ర ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులపై జయలలిత కుటుంబానికి హక్కు లేదని గతంలోనూ కోర్టు తేల్చిచెప్పింది.
.
.