Chinese Soldiers : శతాబ్దాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణం కల సాకారమైంది. నూతన ఆలయంలో బాల రాముడి (Ram Lalla) ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చైనా సైనికులు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తున్నట్లు ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.
Chinese Soldiers : శతాబ్దాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణం కల సాకారమైంది. నూతన ఆలయంలో బాల రాముడి (Ram Lalla) ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చైనా సైనికులు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తున్నట్లు ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.
వాస్తవాధీన రేఖ వెంట (LAC) భారత సైన్యంతో కలిసి చైనా భద్రతా దళాలు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. భారత్-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంట కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాల సైనికాధికారులు పలుమార్లు చర్చలు సైతం జరుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది.
జై శ్రీరామ్ నినాదాన్ని ఎలా ఉచ్చరించాలన్న విషయాన్ని చైనా భద్రతా దళాలకు భారత్ సైనికులు చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. అందుకు తగినట్లుగానే చైనా సైనికులు ‘జై శ్రీరామ్’అంటూ నినాదాలు చేయడం కనిపించింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. అయినప్పటికి.. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజే ఓ మాజీ సైనికుడు దీన్ని ‘ఎక్స్’లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది.