Prasanth kishore : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీకి షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీతో కలిసి పని చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో టీడీపీతో కలిసి పని చేసే విషయంపై అడిగిన ప్రశ్నకు ఆయనకు బదులిచ్చారు.
Prasanth kishore : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీకి షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీతో కలిసి పని చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో టీడీపీతో కలిసి పని చేసే విషయంపై అడిగిన ప్రశ్నకు ఆయనకు బదులిచ్చారు.
తన కోసం చంద్రబాబు ఎన్నికల్లో పని చేయమని అడిగారని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. కానీ అందుకు తాను నిరాకరించినట్టు తెలిపారు. అయితే చంద్రబాబు కామన్ ఫ్రెండ్ కాబట్టి ఇదే విషయాన్ని చెప్పడం కోసం విజయవాడ వచ్చినట్టు తెలిపారు. ఒక టీడీపీకే కాదు.. ఏ పార్టీ కోసం కూడా తాను పని చేయనని ప్రశాంత కిషోర్ స్పష్టంగా చెప్పారు.
గతంలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. 2019లో ఎన్నికల్లో పీకే వ్యూహాలనే జగన్ అమలు చేశారు. భారీ విజయాన్ని అందుకున్నారు. కొంతకాలం క్రితం వరకు కూడా పీకే వైసీపీకి పనిచేశారు. ఇటీవల విజయవాడలో చంద్రబాబును కలవడంతో పీకే టీడీపీకి పనిచేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రశాంత కిశోర్ స్వయం పనిచేయడంలేదని చెప్పడంతో ఈ అంశంపై క్లారిటీ వచ్చేసింది.