Dharani committee meeting news(latest news in telangana):
భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని ధరణి కమిటీ వెల్లడించింది. అలాగే వీలైనంత వేగంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని సభ్యులు తెలిపారు. ఎల్లుండి కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భూ వ్యవహారాలతో సంబంధం ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలతో చర్చిస్తామని సభ్యులు తెలిపారు. కమిటి ప్రాథమిక పరిశీలనలో ధరణి పోర్టల్ లో అనేక సమస్యలు గుర్తించామని చెప్పారు.
ధరణి తప్పిదాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అందుకే హైకోర్టులో అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ధరణి పోర్టల్ రూపొందించిన ఫాల్కన్ ప్రతినిధులను సైతం సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఫాల్కన్ తరపున ఎవరూ హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిటీ సభ్యులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయంలో ధరణి కమిటీ సమావేశమై కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకుంది.