Kailash Satyarthi : అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ చారిత్రకమైన రోజు అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి పేర్కొన్నారు. నేడు ఆయన అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమానికి వచ్చారు. ప్రపంచం యుద్ధాలు, హింస నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. అలా చేయడమే మన బాధ్యతన్నారు. అయోధ్య మనకిచ్చే సందేశం అదేనన్నారు.
Kailash Satyarthi : అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ చారిత్రకమైన రోజు అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి పేర్కొన్నారు. నేడు ఆయన అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమానికి వచ్చారు. ప్రపంచం యుద్ధాలు, హింస నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. అలా చేయడమే మన బాధ్యతన్నారు. అయోధ్య మనకిచ్చే సందేశం అదేనన్నారు.
అయోధ్య రామమందిర నిర్మణం కచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుందని కైలాస్ సత్యార్థి ఆశాభావం వ్యక్తం చేశారు. రాముడు.. మానవులందరికీ ఆదర్శమన్నారు. మనం ఆయన్ను ఆరాధిస్తున్నప్పుడు కరుణ, సోదరభావం, న్యాయంతో జీవించడం అనేది మనలో అసలైన సవాలు అని పేర్కొన్నారు.
ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన పూజారి ఆచర్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ నేడు ప్రాణప్రతిష్ఠ నుంచి రామరాజ్యం మొదలైందన్నారు. దేశంలో అన్ని అసమానతలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ ప్రేమతో జీవిస్తారన్నారు. అయోధ్య నుంచి మొదలైన ఈ మార్పు దేశం మొత్తం వ్యాపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరికీ శ్రీరాముడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు.