Ayodhya : అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని పలువురు వ్యాపరవేత్తలు తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శ్రీ రాముడు మతానికి అతీతుడని మహీంద్ర కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. మన విశ్వాసాలు ఏవైనా.. గౌరవం, బలమైన విలువలతో జీవించడానికి అంకితమైన వ్యక్తి శ్రీ రాముడు అని కొనియాడారు.
Ayodhya : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని పలువురు వ్యాపరవేత్తలు తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శ్రీ రాముడు మతానికి అతీతుడని మహీంద్ర కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. మన విశ్వాసాలు ఏవైనా.. గౌరవం, బలమైన విలువలతో జీవించడానికి అంకితమైన వ్యక్తి శ్రీ రాముడు అని కొనియాడారు.
శ్రీ రాముని బాణాలు చెడు, అన్యాయాన్ని లక్ష్యంగా చేసుకొని ఉన్నాయని ఆనంద్ మహీంద్ర అన్నారు. రామరాజ్యం అనే ఆదర్శ పాలన భావనే అన్ని సమాజాల ఆకాంక్ష అన్నారు. ఇప్పుడు రామ్ అనే పదం ఏ దేశానికో ప్రాంతానికి సంబంధించినది కాదని యావత్తు ప్రపంచానికి సంబంధించి భావన అని ఆయన కొనియాడారు.
అయోధ్య రామ మందిరం దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. పవిత్రమైన ఈ రోజున తెరుచుకుంటున్న అయోద్య మందిర తలుపులు జ్జానోదయం, శాంతికి ప్రవేశద్వారంగా ఉండాలన్నారు. తద్వారా భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సామరస్యం ఈ సమాజాన్ని కాలాతీత బంధంతో ఏకం చేయాలని కాంక్షిద్దామని పిలుపునిచ్చారు.