Visakhapatnam RK Beach : అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విశాఖపట్నం రుషికొండ బీచ్లో లైవిన్ అడ్వెంచర్స్కు చెందిన డైవర్లు ప్రత్యేకంగా రూపొందించిన బోర్డుపై శ్రీరాముడి చిత్రపటాన్ని సముద్రగర్బంలో ప్రదర్శించారు. శుభ సందర్భానికి గుర్తుగా వినూత్నమైన ప్రయత్నం చేశారు. సముద్రంలో 22 అడుగుల లోతులో నీటి బుడగలు, పూల జల్లులతో చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంప్రదాయాన్ని కూడా పాటించారు.
అయోధ్యలో జరుగుతున్న అద్భుత వేడుకకు తమవంతుగా ఇలా సముద్రం నీటి అడుగున శ్రీరాముడి ఫోటోను ప్రదర్శించామని డైవర్లు తెలిపారు. తాము ఇలా వినూత్నంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.