అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల శ్రీరామ శోభాయాత్రలు జరుపుతున్నారు. మరోవైపు ప్రసిద్ధ భద్రాచలం రామాలయంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. స్వామివారి పాదాలకు స్వర్ణ పుష్పాలతో అర్చన చేశారు.
అనంతరం శ్రీరామరథంతో పట్టణంలో రథయాత్ర చేపట్టారు. వేద మంత్రలతో, మంగళవాయిద్యాలతో, హరిదాసుల కీర్తనల మధ్య అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి రథయాత్ర రంగరంగ వైభవంగా కొనసాగింది. శోభాయాత్ర సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేస్తూ కాషాయ జెండాలతో భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు.