EPAPER
Kirrak Couples Episode 1

Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న చంద్రబాబు, పవన్, రజనీకాంత్

Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న చంద్రబాబు, పవన్, రజనీకాంత్

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర పునఃప్రతిష్ఠాపనకు మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమం కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. అయితే ఈ శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రముఖులు అయోధ్యకు చేరుకోగా మరికొందరు ఇవాళ అక్కడికి చేరుకోనున్నారు.


టీడీపీ అధినేత చంద్రబాబు, టాలీవుడ్ పవర్‌ స్టార్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌‌తో పాటు సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా అయోధ్యకు చేరుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు ఇప్పటికే పలు ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కల.. 500 ఏళ్ల తర్వాత నెరవేరుతోందని అన్నారు.

అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా మొత్తం 7వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. పునఃప్రతిష్ఠాపనకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.


Related News

Devara Movie: మరోసారి ‘దేవర’కు ‘ఆంధ్రావాలా’తో పోలిక.. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో?

Devara Pre Release Event: ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ మాస్.. ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సెల్?

Director Shankar: ఆ సీన్స్ కాపీ కొట్టారు.. ‘దేవర’ ట్రైలర్‌పై దర్శకుడు శంకర్ షాకింగ్ ఆరోపణలు?

Guinness World Record : గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్న ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్… ఎంత మంది సౌత్ స్టార్స్ ఉన్నారో తెలుసా?

Chiranjeevi: గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చిరుకు చోటు… ఎందుకో తెలుసా?

Amitabh Bachchan: అప్పుడు నేలపైనే పడుకునేవారు, ఆయన స్టార్లలోనే సుప్రీమ్.. రజినీపై అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Devara Pre Release Event: ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చు అన్ని కోట్లా? గట్టిగానే ప్లాన్ చేశారుగా!

Big Stories

×