అయోధ్య రామయ్యకు దేశ నలుమూలల నుంచి భక్తులు కానుకలు పంపిస్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం చాలా మంది విరాళాల అందిస్తున్నారు. సీతారాముల వారి మీద భక్తి తో ఓ 14 ఏళ్ల బాలిక రామమందిర నిర్మాణం కోసం ఏకంగా రూ.52 లక్షల విరాళాలను సేకరించి ఇచ్చింది.చిన్న వయసులో అంత నగదును సేకరించి ఇచ్చిన బాలికపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
గుజరాత్లోని సూరత్కు చెందిన భవికా మహేశ్వరి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోందని.. దాని కోసం ప్రజలు తమకు తోచినంత విరాళాలు అందిస్తున్నారని తెలుసుకుంది. తానూ కూడా ఆలయానికి విరాళం అందించాలని నిర్ణయించుకుంది.రామాయణం మీద ఉన్న ఆసక్తితో బాలరాముడి కథలు చదవడం ప్రారంభించింది. బహిరంగ సభల్లో ఆ కథలను ప్రజలకు చెప్పింది. 2021లో ఓ జైలులో ఉన్న ఖైదీలకు రాముడి కథలను చెప్పగా వారు రామమందిర నిర్మాణాం కోసం రూ.లక్ష విరాళం ఇచ్చారు.అలా భవికా తాను 11 ఏళ్ల వయసు నాటి నుంచి 50 వేల కిలోమీటర్లు ప్రయాణించి 300 పైగా ప్రదర్శనలు చేసింది. ఆ వింధంగా రూ.52 లక్షల వరకు సేకరించింది. నగదు మొత్తన్ని అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఇచ్చింది.
భవికా రాముడి కథలను ప్రదర్శించడమే కాకుండా 108పైగా వీడియోలను రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది .ఆ వీడియోలను దాదాపు లక్ష మంది వీక్షించారు. అంతేకాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఒక పుస్తకాన్ని కూడా రాసింది.
శ్రీరాముడికి సహాయం చేయడానికి ఉడత ముందుకు వచ్చినట్లే, నేను కూడా రామ మందిర నిర్మాణం కోసం నా వంతు సహాయం చేశాను అని భవికా తెలిపింది. నేను ఇలా చేయడానికి నా తల్లిదండ్రుల నుంచి ప్రేరణ పొందాను. చిన్నప్పటి నుంచి రామాయణం చదివాను. ఎన్నో తరాల వారు రామ మందిరాన్ని చూడలేకపోయారు. రామమందిరం మా తరంలో రూపుదిద్దుకోవడం మా అదృష్టం.” అని
భవికా వివరించింది