Sitara : సూపర్స్టార్ మహేశ్బాబు కుమార్తె సితార తన గొప్ప మనసు చాటుకుంది. అనాథ పిల్లల కోసం సితార ‘గుంటూరుకారం’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసి మరోసారి తన గొప్ప మనసు చాటుకుంది . మహేశ్బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమన్ని నిర్వహించింది. ఏఎంబీలో అత్యంత లగ్జరీ స్క్రీన్లో వారు సినిమా చూసేలా ఏర్పాటు చేసింది. చిన్నారులతో కాసేపు సరదాగా ముచ్చటించి వారితో ఫొటోలు దిగింది. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే మహేశ్ తన సొంత గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశారు. వందలాది మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు ఉచితంగానే చేయించాడు. అలా తన గొప్ప మనసు చాటుకుంటూ సినిమాలతో పాటు మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. సితార కూడా తండ్రి బాటలోనే అడుగులు వేస్తుంది.
కొన్ని నెలల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా పేదింటి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసింది. ఆ విద్యార్థులను తన ఇంటికి ఆహ్వానించిన సితార వారితో సరదాగా మాట్లాడింది. తర్వాత వారితో కేక్ కూడా కట్ చేసింది. ఒక జ్యువెలరీ యాడ్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ మొత్తం ఒక చారిటీకి విరాళంగా ఇచ్చింది. నెటిజన్లు సితార మంచి మనసును మెచ్చుకుంటున్నారు.