PM Modi : ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్, త్రిపుర, మేఘాలయా ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవాలను నిర్వహించుకుంటున్నాయి. ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆవిర్భావ దినం అనేది రాష్ట్రాల ప్రజలు సాధించిన విజయాలను గుర్తు చేసుకునే ప్రత్యేక సందర్భమని ఆయన ట్వీట్ చేశారు. మణిపూర్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. భారత దేశాభివృద్ధికి మణిపూర్ బలమైన సహకారాన్ని అందించిందన్నారు. ఈ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల పట్ల గర్విస్తున్నానన్నారు. మణిపుర్ నిరంతర అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ లో తెలిపారు.
PM Modi : ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్, త్రిపుర, మేఘాలయా ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవాలను నిర్వహించుకుంటున్నాయి. ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆవిర్భావ దినం అనేది రాష్ట్రాల ప్రజలు సాధించిన విజయాలను గుర్తు చేసుకునే ప్రత్యేక సందర్భమని ఆయన ట్వీట్ చేశారు. మణిపూర్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. భారత దేశాభివృద్ధికి మణిపూర్ బలమైన సహకారాన్ని అందించిందన్నారు. ఈ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల పట్ల గర్విస్తున్నానన్నారు. మణిపుర్ నిరంతర అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ లో తెలిపారు.
మేఘాలయా రాష్ట్రం రాబోయే రోజుల్లో సరికొత్త అభివృద్ధి శిఖరాలను అందుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ ప్రత్యేకమైన రోజున త్రిపుర ప్రజల శ్రేయస్సు, సామరస్యాన్ని కోరుకుంటున్నాన్నారు. ఆ రాష్ట్రాల ఘన చరిత్ర, వారసత్వాన్ని గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజు ఇది అని ప్రధాని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.