Komuravelli Mallanna : కేంద్ర ప్రభుత్వం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో రైలు నిలిపేందుకు పచ్చజెండా ఊపింది. కొమురవెల్లి శివారు నుంచి రైల్వే మార్గాన్ని నిర్మింస్తుండగా..సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి రైలు రాకపోకలు సాగిస్తోంది. అయితే మార్గమధ్య ఉన్న కొమురవెల్లిలో హాల్టింగ్ లేకపోవడం గమనార్హం.
Komuravelli Mallanna : కేంద్ర ప్రభుత్వం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో రైలు నిలిపేందుకు పచ్చజెండా ఊపింది. కొమురవెల్లి శివారు నుంచి రైల్వే మార్గాన్ని నిర్మింస్తుండగా..సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి రైలు రాకపోకలు సాగిస్తోంది. అయితే మార్గమధ్య ఉన్న కొమురవెల్లిలో హాల్టింగ్ లేకపోవడం గమనార్హం.
ఇక్కడ స్టేషన్ ఏర్పాటుకు ప్రజలు,రైల్వే అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతిధులకు విన్నవించారు. ఎట్టకేలకు కొమురవెల్లి శివారు నుంచి వెళ్తున్న రైల్వే మార్గంపై హాల్టింగ్ స్టేషన్ నిర్మిస్తామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటనతో మల్లన్న భక్తులు, స్థానికుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ ఏర్పాటుతో లక్షలాది మందికి ప్రయోజనం కలగనుంది.
నాలుగు రాష్ట్రాల నుంచి స్వామి దర్శనానికి ఏటా 25 లక్షల మందికి పైగా భక్తులు వస్తుంటారు. సుమారుగా70 శాతం మంది సామాన్యులే ఉంటారు. వారంతా ఆర్టీసీ బస్సులలో ప్రైవేటు వాహనాలలో ఆలయానికి చేరుకుంటారు. బస్సుల్లో వచ్చే వారికి రాజీవ్ రహదారి నుంచి 3 కి.మీ. దూరంలోని కొమురవెల్లి చేరుకుంటారు.తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రయాణికులు ప్రధాన రహదారిపై గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తుంది.
హైదరాబాద్ నుంచి 110 కి.మీ., కరీంనగర్ నుంచి 90 కి.మీ. రెండు, మూడు వాహనాలు మారుతూ ప్రయాణించాల్సి వస్తుంది. హైదరాబాద్ నుంచి ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.150, కరీంనగర్ నుంచి రూ.100 ఖర్చు వస్తుంది. రైలు ప్రయాణమైతే సగం భారం తగ్గే అవకాశం ఉంటుంది. కొమురవెల్లి సమీపంలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది.