Krishna : భార్యాభర్తలు మధ్య రూ.500 చిచ్చు పెట్టి ఇద్దరు ఆవేశంతో ఆత్మహత్యలకు పాల్పడేల చేసి ఆ కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. వాసవీనగర్కు చెందిన కొలుసు రాంబాబు(45) అనే వ్యక్తి ప్రైవేటు ట్రావెల్స్లో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతని భార్య , కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. రూ.500 కావాలని రాంబాబు తన భార్య కనకదుర్గ(40)ను అడిగాడు.
Krishna : భార్యాభర్తలు మధ్య రూ.500 చిచ్చు పెట్టి ఇద్దరు ఆవేశంతో ఆత్మహత్యలకు పాల్పడేల చేసి ఆ కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. వాసవీనగర్కు చెందిన కొలుసు రాంబాబు(45) అనే వ్యక్తి ప్రైవేటు ట్రావెల్స్లో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతని భార్య , కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. రూ.500 కావాలని రాంబాబు తన భార్య కనకదుర్గ(40)ను అడిగాడు.
ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో రాంబాబు ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన భార్య చుట్టుపక్కల వారి సాయంతో రాంబాబును కిందకు దించారు. కుమారుడు గౌతమ్ తండ్రిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఆ విషయాన్ని గౌతమ్ తల్లికి ఫోన్చేసి చెప్పడు. తన వల్లే భర్త మృతి చెందాడని మనస్తాపానికి గురై ఆమె కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డింది. కుమారుడు ఇంటికి వచ్చేసరికి కనకదుర్గ ఉరికి వేలాడుతూ కనిపించింది.
ఒకవైపు తండ్రి మృతదేహం, మరోపక్క విగతజీవిగా ఉరికి వేలాడుతున్న తల్లిని చూసిన గౌతమ్ తల్లడిల్లిపోయాడు. స్థానికుల సాయంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. ఆమె కూడా మృతి చెందిందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రుల మృతదేహాలు చూసిన అక్కా, తమ్ముళ్ల రోదనలు మిన్నంటాయి.