TS Govt : తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేత హర్కర వేణుగోపాల్ను సలహాదారులగా నియమించింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించిది. ఈ నలుగురికీ కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా షబ్బీర్ అలీ వ్యవహరించనున్నారు. ప్రొటోకాల్, పౌర సంబంధాల సలహాదారుగా వేణుగోపాల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
TS Govt : తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేత హర్కర వేణుగోపాల్ను సలహాదారులగా నియమించింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించిది. ఈ నలుగురికీ కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా షబ్బీర్ అలీ వ్యవహరించనున్నారు. ప్రొటోకాల్, పౌర సంబంధాల సలహాదారుగా వేణుగోపాల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది. దీనిలో భాగంగానే ఇటీవల బల్మూరి వెంకట్, మహేశ్కుమార్ గౌడ్లకు ఎమ్మెల్సీ అభ్యర్థులగా అవకాశం కల్పించింది. ప్రభుత్వ సలహాదారుల నియామకం ద్వారా నలుగురు కీలక నేతలకు పదవులు కేటాయించింది. ఆర్టీసీ ఛైర్మన్ సహా మరికొన్ని కీలక పదవులకు ఇప్పటికే కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నారు. పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చాక వాటిపై స్పష్టత రానుంది.