పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. తాజాగా సిరియా రాజధాని డమాస్కస్పై జరిగిన క్షిపణి దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) అధికారులు నలుగురు మృతి చెందారు. వారిలో నిఘా వ్యవహారాల యూనిట్ చీఫ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఈ దాడి చేసినట్టుగా ఇరాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
మృతుల్లో ఐజీఆర్సీకి చెందిన అత్యున్నత అధికారులు ఇద్దరు ఉన్నట్టు ఆ వర్గాలు ధ్రువీకరించాయి. డమాస్కస్ సమీప మెజాలోని ఓ బహుళ అంతస్తుల భవనం ఈ దాడితో నేలమట్టమైంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ప్రభుత్వ అనుకూలంగా ఉండే ఇరానియన్ సలహాదారుల ఆ భవనాన్ని వినియోగిస్తున్నట్టు సమాచారం.
అదే భవనంలో లెబనాన్, ఇరాన్ ఎంబసీలు పనిచేస్తున్నట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనలో మరో పది మంది గాయపడ్డారు. గత నెలలో ఇజ్రాయెల్ జరిపిన ఇలాంటి క్షిపణి దాడిలోనే ఇరాన్ జనరల్ సయ్యద్ రజీ మౌసావి మృతి చెందారు.