Srisailam Temple : కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నేడు కార్తీక పౌర్ణమి వేడుకలు జరగనున్నాయి. మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కృష్ణా నది వద్ద నదీమ తల్లికి గంగా హారతి ఇవ్వనున్నారు. ప్రదోషకాల సమయంలో గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం నిర్వహిస్తారు. పుష్కరిని వద్ద దశవిధ హారతులు, లక్ష దీపోత్సవం ఉంటాయి. లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారని అర్చలు, ఆలయ అధికారులు తెలిపారు.