Medha Shankar : గత ఏడాది 2023 అక్టోబర్ 27న విడుదల అయిన 12th ఫెయిల్ సినిమా విజయం సాధించింది. ఈ సినిమాలో హిరోయిన్గా మేధా శంకర్ నటించింది. అద్భుత నటనతో సినీ అభిమానులకు చేరువైంది. ఆమె నటించిన తీరుపై సాధారణ ప్రజల నుంచి సినీ ప్రముఖల వరకు ఆమె నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మేధా శంకర్ నోయిడాలో పుట్టింది. ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డీగ్రీ పూర్తి చేసింది. తర్వాత మోడల్గా కేరీర్ని ప్రారంభించింది. 2016 లో నిర్వహించిన ఎఫ్బీబీ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఆమె పాల్గొంది. నటనపై మక్కువతో ముంబయిలో స్థిరపడింది. తర్వాత విత్ యు ఫర్ యు ఆల్వేజ్ అనే లఘ చిత్రంలో నటించింది. సంగీతంపై మక్కువతో హిందుస్థానీ సంగీతంలో శిక్షణ పొందింది. సీతార్, హార్మోనియం, కీబోర్డు మొదలైన వాటిని నేర్చుకుంది.
గత ఏడాది 2023 అక్టోబర్ 27న విడుదల అయిన 12th ఫెయిల్ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో హిరోయిన్గా మేధా శంకర్ నటించింది. అద్భుత నటనతో సినీ అభిమానులకు చేరువైంది. సాధారణ ప్రజల నుంచి సినీ ప్రముఖల వరకు ఆమె నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మేధా శంకర్ నోయిడాలో పుట్టింది. ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డీగ్రీ పూర్తి చేసింది. తర్వాత మోడల్గా కేరీర్ని ప్రారంభించింది.
2016 లో నిర్వహించిన ఎఫ్బీబీ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఆమె పాల్గొంది. నటనపై మక్కువతో ముంబయిలో స్థిరపడింది. తర్వాత విత్ యు ఫర్ యు ఆల్వేజ్ అనే లఘ చిత్రంలో నటించింది. సంగీతంపై మక్కువతో హిందుస్థానీ సంగీతంలో శిక్షణ పొందింది. సీతార్, హార్మోనియం, కీబోర్డు మొదలైన వాటిని నేర్చుకుంది.
బ్రిటిష్ సిరీస్ బీకమ్ హౌజ్(2019) , మరో సిరీస్ దిల్ బేకరార్(2021)లో కీలక పాత్రలో నటించింది. 2021 లో శాదీస్తాన్ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. సంగీతం ఇతివృత్తంగా సాగే ఈ సినిమాలో అర్షి మోదీగా నటించి ప్రేక్షకులను అలరించింది. 2022లో విడుదల అయినా మ్యాక్స్, మిన్ అండ్ మ్యూజకీ సినిమాలో అద్భుత నటన కనబరించింది. ఈ మూవీలో బాయ్ ఫ్రెండ్ను త్యాగం చేసిన అమ్మాయిగా నటించి యువతను మెప్పించింది. ఈ సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమవడం విశేషం.
తాజాగా మూడో చిత్రం 12th ఫెయిల్ సినిమాలో నటించింది. అందులో బోలో నా పాటను పాడి అలరించింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఇన్ స్టాగ్రామ్లో 16 వేల మంది ఫాలోవర్స్ కలిగి ఉంది. సినిమా విడుదల అయినా తర్వాత ఫాలోవర్స్ సంఖ్య 20 లక్షలకు చేరుకుంది.
తన కేరీర్ ప్రారంభంలో అనేక కష్టాలు ఎదురు అయ్యాయని తెలిపింది. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటేనే ఇండస్ట్రీలో ఉండగలం అని ప్రకటించింది. సవాలు విసిరే పాత్రల్లో నటించటం తనకు ఇష్టమని ప్రకటించింది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితాధారంగా రూపోందిన చిత్రంలో ఆయన ప్రియురాలు, సతీమనీ పాత్రలో నటించింది. విక్రాంత్ మస్సే ప్రధాన ప్రాత్రలో నటించిన ఈ సినిమా స్ఫూర్తిదాయక చిత్రంగా నిలిచింది.