Vallabbhaneni Balashowry : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కలిశారు. ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. అదేసమయంలో జనసేనలో చేరతానని ప్రకటించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో జనసేనానితో బాలశౌరి భేటీ అయ్యారు.ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారని తెలుస్తోంది.
మొన్నటి వరకు సీఎం వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడిగా బాలశౌరి మెలిగారు. కొద్దిరోజులుగా పార్టీలో జరిగిన పరిణామలతో వైసీపీ గుడ్ బై చెప్పారు. ఆయన రాజీనామా చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. బాలశౌరి మచిలీపట్నం నుంచి బరిలోకి దిగుతారా? గుంటూరుపై గురిపెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది.