Nayanthara : ‘అన్నపూరణి’ వివాదంపై నయనతార స్పందించి క్షమాపణలు చెప్పారు. అగ్రకథానాయిక నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). నీలేశ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం వివాదాస్పదమైంది. తాజాగా దీనిపై నయనతార స్పందించారు.
Nayanthara latest news(Today tollywood news):
‘అన్నపూరణి’ వివాదంపై నయనతార స్పందించి క్షమాపణలు చెప్పారు. అగ్రకథానాయిక నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). నీలేశ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం వివాదాస్పదమైంది. తాజాగా దీనిపై నయనతార స్పందించారు.
‘అన్నపూరణి’ సినిమాను ప్రజల్లోకి మంచి ఆలోచనను తీసుకెళ్లేందుకు రూపొందించామని బరువెక్కిన హృదయంతో చెప్పారు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలియజేసేందుకే ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. ఈ ప్రయత్నంలో తెలియకుండానే కొందరి మనసులను గాయపరిచామని ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చినా.. సినిమాను ఓటీటీ వేదిక నుంచి తొలగిస్తారని అస్సలు ఊహించలేదన్నారు.
తమ చిత్ర బృందం ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదని నయనతార ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఎవ్వరి మనోభవాలను గాయపర్చాలనుకోలేదన్నారు. అలా జరిగితే దయచేసి క్షమించాలన్నారు. అన్న పూరణి చిత్ర ప్రధాన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదన్నారు. 20 ఏళ్ల కెరీర్లో సానుకూలతను వ్యాప్తి చేయాలనే చూశానని ఆమె పేర్కొన్నారు.
నయనతార 75వ చిత్రంగా ‘అన్నపూరణి’ విడుదలైంది. ‘ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనేది ట్యాగ్ లైన్. సంప్రదాయ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.. చెఫ్గా ఎదగాలనే తన కలను ఎలా సాకారం చేసుకుంది? అనే కథాంశంతో దీనిని రూపొందించారు. ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదల కాగా.. ఇందులోని కొన్ని సన్నివేశాలు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించారు.