SC Classification : ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ముందడుగు వేసింది. ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. కమిటీలో నాలుగు కీలక శాఖల కార్యదర్శలకు కేంద్రం చోటు కల్పించింది. కేంద్ర హోం, గిరిజన, న్యాయ, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను కమిటీ సభ్యులుగా నియమించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కమిటీ ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారమే ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలోనే సుప్రీంకోర్టు కూడా అంగీకారం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటైన కమిటీ ఈ నెల 22న తొలిసారి సమావేశమవుతుందని తెలుస్తోంది.