CM Revanth Reddy : దావోస్ టూర్ ముగించుకున్న రేవంత్ రెడ్డి 3 రోజల పాటు లండన్లో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన లండన్ చేరుకున్నారు. తెలుగువాళ్ల ఆత్మీయ కలయిక అంటూ ఇవాళ హెస్టన్ హైడ్ హోటల్, నార్త్ హైడ్ లేన్, హౌన్స్లో జరిగే ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రేపటి అద్బుత తెలంగాణ కోసం మార్పు మొదలైంది అనే ట్యాగ్లైన్తో యూకేలోని తెలంగాణ ప్రవాస సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక రేవంత్ రెడ్డి హైద్రాబాద్ను, తెలంగాణను ఏవిధంగా డెవెలప్ చేయాలి అనుకుంటున్నారో.. ఆయన డెవెలెప్మెంట్ ప్లాన్ ఏంటో లండన్ టూర్ లో వివరించనున్నారు.
దావోస్ టూర్ ముగించుకున్న రేవంత్ రెడ్డి 3 రోజల పాటు లండన్లో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన లండన్ చేరుకున్నారు. తెలుగువాళ్ల ఆత్మీయ కలయిక అంటూ ఇవాళ హెస్టన్ హైడ్ హోటల్, నార్త్ హైడ్ లేన్, హౌన్స్లో జరిగే ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రేపటి అద్బుత తెలంగాణ కోసం మార్పు మొదలైంది అనే ట్యాగ్లైన్తో యూకేలోని తెలంగాణ ప్రవాస సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక రేవంత్ రెడ్డి హైద్రాబాద్ను, తెలంగాణను ఏవిధంగా డెవెలప్ చేయాలి అనుకుంటున్నారో.. ఆయన డెవెలెప్మెంట్ ప్లాన్ ఏంటో లండన్ టూర్ లో వివరించనున్నారు.
తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించి అభివృద్ది చేయాలనేది కాంగ్రెస్ సర్కార్ ప్లాన్. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ క్లస్టర్, ORR తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్గా, ఇక తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత చుట్టూరా ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా డివైడ్ చేసి డెవలెప్ చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నుంచి చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహాకాలు ఇవ్వాలని గవర్నమెంట్ భావిస్తోంది.
హైదరాబాద్ నగరానికి ప్రప్రంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నైట్ థేమ్స్ రివర్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మూసీని థేమ్స్లా డెవలప్ చేసే ఆలోచనలో భాగమే రేవంత్ రెడ్డి పర్యటన అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
.