Arvind Kejriwal : డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా నాలుగోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసు విచారణకు హాజరుకావడం లేదని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సమాచారం ఇచ్చారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా తాను గోవా పర్యటనకు వెళుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా నాలుగోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Scam) విచారణకు హాజరుకావడం లేదని కేజ్రీవాల్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate)కు సమాచారం ఇచ్చారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా తాను గోవా పర్యటనకు వెళుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో విద్యాశాఖ కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరుకానున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంతో పాటు బహిరంగ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. గోవాలో ముందస్తుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉండటంతో విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి మూడు రోజుల పాటు పర్యటించనున్నట్లు వెల్లడించారు.
మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు ఇప్పటికే ఈడీ మూడుసార్లు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ నోటీసులు చట్టవిరుద్ధమని.. రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి తనను దూరం చేసేందుకే కేంద్రంలోని బీజేపీ ఇదంతా చేస్తోందని అన్నారు. వీటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈడీ జనవరి 18న విచారణకు హాజరు కావాలని కోరుతూ గత వారం నాలుగోసారి సమాన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.