Gudivada : కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ-జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులపై టీడీపీ-జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.
Gudivada : కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ-జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులతో టీడీపీ-జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.
ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వెళ్లేందుకు మాజీ మంత్రి కొడాలి నానికి అనుమతి ఇచ్చారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ, జనసేన నేతలు పోలీసులను నిలదీశారు. ఎన్టీఆర్కు నివాళులర్పించి తీరుతామని గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము తేల్చిచెప్పారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్దకు భారీగా టీడీపీ-జనసేన కార్యకర్తలు చేరుకుంటున్నారు.