Election Commission : ఏపీలో ఓటర్ల అవకతవకలపై ఫిర్యాదుల మేరకు ఆరా తీస్తోంది ఎన్నికల కమిషన్. ఈ మేరకు తిరుపతిలో ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా.. ఆర్ ఓ లాగిన్ నుంచి ఓటర్లకార్డులు డౌన్లోడ్ అయినట్టు గుర్తించింది ఎన్నికల కమిషన్.
ఏపీలో ఓటర్ల అవకతవకలపై ఫిర్యాదుల మేరకు ఆరా తీస్తోంది ఎన్నికల కమిషన్. ఈ మేరకు తిరుపతిలో ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా.. ఆర్ ఓ లాగిన్ నుంచి ఓటర్లకార్డులు డౌన్లోడ్ అయినట్టు గుర్తించింది ఎన్నికల కమిషన్.
గతంలో ఆర్ వోగా పని చేసిన గిరీషా.. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. దర్యాప్తులో 30 వేల కార్డులు డౌన్లోడ్ చేసి మార్ఫింగ్ చేసినట్టు అధికారులు నిర్ధారణకు రావడంతో సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. కాగా.. ఈ కేసు వాపస్ తీసుకోవాలని ఫిర్యాదుదారుల నుంచి ఒత్తిడి మొదలైంది. ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కేసు వాపస్పై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.