Kodi Kathi Case : ఏపీ సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. గురువారం నుంచి దీక్ష చేస్తానని తమకు చెప్పాడని కుటుంబం సభ్యుల వెల్లడించారు. అతడికి మద్దతుగా తాము కూడా దీక్ష చేపడతామని ప్రకటించారు.
5 ఏళ్లుగా తన కొడుకు జైల్లోనే ఉన్నాడని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పడం లేదన్నారు. జగన్ సాక్ష్యం చెప్పాలని కోరారు. జైలులోనే ఆమరణ దీక్షకు దిగుతున్నానని తమకు ఫోన్ చేసి చెప్పాడని వెల్లడించారు.
తన తమ్ముడు వల్ల సీఎం జగన్ లబ్ధి పొందారని శ్రీను సోదరుడు సుబ్బరాజు అన్నారు. తన తమ్ముడు దళితుడనే వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం దుర్గమాత సాక్షిగా ఆమరణ దీక్ష చేస్తామని ప్రకటించారు. ప్రాణాలైన అర్పిస్తామని హెచ్చరించారు. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టమని చెప్పారు. డబ్బున్న వాడికి ఒక న్యాయం, లేని వాడికి మరో న్యాయంలాగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.