Praja Bhavan Car Accident Case : హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్పై కూడా కేసు నమోదైంది. ఆయన పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. షకీల్ కుమారుడు సాహిల్ గతేడాది డిసెంబర్ లో కారును వేగంగా నడుపుతూ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టాడు. ఈ కేసు నుంచి కొడుకును షకీల్ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. సాహిల్ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్కు నోటీసులు ఇచ్చారు.
సీఐను మభ్యపెట్టారన్న ఆరోపణలపై షకీల్తోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. ఈ ఘటనలో మొత్తం 10 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం ఘటన తర్వాత సాహిల్ దుబాయ్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలోనే లుకౌట్ నోటీసులు పోలీసీలు జారీ చేశారు. అప్పటికే దుబాయ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్.. తన కుమారుడిని దుబాయ్కి పిలిపించుకున్నారని వార్తలు వచ్చాయి.. తాజాగా షకీల్తో పాటు మరో ఇద్దరిపైనా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.