ఏపీ పగ్గాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. ఏపీసీసీ అధ్యక్షరాలిగా ఆమెను నియమించింది. ఇటీవల షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు కీలక పదవి ఇస్తారని స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఏపీ బాధ్యతలు షర్మిలకు అప్పగించింది.
తాజాగానే ఏపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగిస్తారనే అధిష్టానం సమాచారం రాగానే ఆయన పీసీసీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం కల్పించారు.
తనను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించడంపై షర్మిల స్పందించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలకు ధన్యవాదాలు తెలిపారు. శక్తివంచన లేకుండా నిస్వార్ధంగా పార్టీ కోసం పని చేస్తానని షర్మిల ట్వీట్ చేశారు.