Houthi Rebels | ఎర్ర సముద్రంలో హౌతీ విద్రోహులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన కంటైనర్ షిప్ గిబ్రాల్టర్ ఈగల్పై హౌతీలు బాలిస్టిక్ మిసైల్స్తో దాడులు చేశారు. ఈ దాడుల తరువాత షిప్లో మంటలు చెలరేగినట్లు సమాచారం.
Houthi Rebels | ఎర్ర సముద్రంలో హౌతీ విద్రోహులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన కంటైనర్ షిప్ గిబ్రాల్టర్ ఈగల్పై హౌతీలు బాలిస్టిక్ మిసైల్స్తో దాడులు చేశారు. ఈ దాడుల తరువాత షిప్లో మంటలు చెలరేగినట్లు సమాచారం. అయితే షిప్లో ఉన్న సిబ్బందికి ఎటువంటి ప్రాణ హాని కలుగలేదని.. షిప్లో కూడా భారీ నష్టం కలుగలేదని అమెరికా అధికారులు తెలిపారు. ఈ దాడి తామే చేసినట్లు హౌతీ రెబెల్స్ ప్రకటించారు.
హౌతీ తిరుగుబాటుదారుల ప్రతినిధి యహ్య సరీ ఒక వీడియో ప్రకటనలో మాట్లాడుతూ.. ”అమెరికా, బ్రిటిష్కు చెందిన యుద్ధనౌకలు మా దేశంపై దాడి చేశాయి. “వారి యుద్ధ నౌకలను మేము టార్గెట్ చేస్తాం. అవి మా శత్రులక్ష్యాలు,” అని యహ్య సరీ చెప్పారు.
గత కొంతకాలంగా హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో వాణిజ్య కంటైనర్ షిప్లను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ మిసైల్స్తో దాడులు చేస్తున్నాయి. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఇజ్రాయెల్ ఆపేయాలని వారి డిమాండ్. హౌతీలను కట్టడి చేసేందుకు అమెరికా, బ్రిటన్ ఎర్రసముద్రంలో యుద్ధనౌకలను మోహరించాయి. ఇటీవల యెమెన్ దేశంలోని హౌతీ రెబెల్స్ ఆయుధ స్థావరాలపై అమెరికా, బ్రిటన్ వరుసగా దాడులు చేశాయి.
అయినా హౌతీ విద్రోహులు వెనక్కు తగ్గేది లేదని చెబుతున్నారు. గాజాలో అమాయక పౌరులను చంపుతున్న ఇజ్రాయెల్ని కట్టడి చేసేంత వరకూ దాడులు చేస్తూనే ఉంటామని.. ఇజ్రాయెల్ను సమర్థించే ఎవ్వరినీ వదిలేది లేదని హౌతీ రెబెల్స్ వార్నింగ్ ఇచ్చారు.