Non Veg Market : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోనే ఉంది. ఇప్పటికే భోగీ, సంక్రాంతి పండుగలు ముగిశాయి. మూడవ రోజు కనుమ పండుగ అంటే నాన్ వెజ్ ప్రియులకు అత్యంత ప్రీతికరమైంది. సంకాంత్రి వేడుకల్లో భాగంగా చివరి రోజైన.. కనుమ నాడు నాన్ వెజ్ తినడం అనవాయితీగా వస్తుంది. కనుమ నాడు.. ముక్క లేనిదే ముద్దదిగదు అంటే అతిశయోక్తి కాదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చికెన్, మటన్ సెంటర్లు ఉదయం నుంచి రద్దీగా మారాయి. చికెన్, మటన్ లతో పోటీగా చేపలు అమ్ముడవుతున్నాయని తెలుస్తుంది.
Non Veg Market : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోనే ఉంది. ఇప్పటికే భోగీ, సంక్రాంతి పండుగలు ముగిశాయి. మూడవ రోజు కనుమ పండుగ అంటే నాన్ వెజ్ ప్రియులకు అత్యంత ప్రీతికరమైంది. సంకాంత్రి వేడుకల్లో భాగంగా చివరి రోజైన.. కనుమ నాడు నాన్ వెజ్ తినడం అనవాయితీగా వస్తుంది. కనుమ నాడు.. ముక్క లేనిదే ముద్దదిగదు అంటే అతిశయోక్తి కాదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని చికెన్, మటన్ సెంటర్లు ఉదయం నుంచి రద్దీగా మారాయి. చికెన్, మటన్ లతో పోటీగా చేపలు అమ్ముడవుతున్నాయని తెలుస్తుంది.
ఇక ప్రతి ఏటా లానే ఈ ఏడాది కూడా నాన్ వెజ్ ప్రియులు.. చికెన్ సెంటర్ల దగ్గర క్యూ కట్టారు. వినియోగదారుల డిమాండ్ ను గమనించి 30 రూపాయల నుంచి 50 రూపాయలు పెంచి చికెన్ వ్యాపారులు అమ్మకాలు జరుపుతున్నారని సమాచారం అందుతుంది. మరోవైపు చికెన్, మటన్ లతో పోటీగా చేపలు అమ్ముడవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ముక్క కోసం రెండు గంటలకు పైగా క్యూలైన్లోనే నిల్చుని ఉన్నామని నాన్ వెజ్ ప్రియులు చెబుతున్నారు. ఎప్పటికంటే ఇవాళ రష్ ఎక్కువగా ఉందని నాన్ వెజ్ ప్రియులు చెబుతున్నారు.