Sharmila : ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో షర్మిల పాత్రపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆమె..పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపడుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. దేశంలో లోక్సభ ఎలక్షన్స్ కూడా జరగనున్న నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది హస్తం అధిష్టానం. కర్ణాటక, తెలంగాణలో మాదిరే ఏపీలోనూ విక్టరీ సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పజెప్తే.. పదేళ్లనాటి పూర్వవైభవం నెలకొంటుందని.. జగన్ను ఎదుర్కొవడం సులువు అవుతుందన్న అంచనాల్లో ఉంది. ఈ మేరకు త్వరలో షర్మిలను పీసీసీ చీఫ్గా నియమిస్తారన్న టాక్ వినిపిస్తోంది.
Sharmila : ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో షర్మిల పాత్రపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆమె..పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపడుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. దేశంలో లోక్సభ ఎలక్షన్స్ కూడా జరగనున్న నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది హస్తం అధిష్టానం. కర్ణాటక, తెలంగాణలో మాదిరే ఏపీలోనూ విక్టరీ సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పజెప్తే.. పదేళ్లనాటి పూర్వవైభవం నెలకొంటుందని.. జగన్ను ఎదుర్కొవడం సులువు అవుతుందన్న అంచనాల్లో ఉంది. ఈ మేరకు త్వరలో షర్మిలను పీసీసీ చీఫ్గా నియమిస్తారన్న టాక్ వినిపిస్తోంది.
ఏపీలో వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ హవా నడించింది. ఆ తర్వాత టీడీపీ, వైసీపీల గాలికి హస్తం డీలా పడింది. దీంతో తమ పార్టీ ఉనికిని చాటుకోవడానికి తెలంగాణలో చక్రం తిప్పాలనుకున్న షర్మిలను ఏపీలో దించింది. షర్మిలకు పగ్గాలు అప్పగిస్తే.. ఒకనాటి వైఎస్ఆర్ అభిమానులంతా మళ్లీ కాంగ్రెస్లో చేరే అవకాశముంటుందని.. తద్వారా అధికారం ఖాయమన్న భావనలో ఉంది అధిష్టానం. ఇక మరోవైపు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడగా ఉన్న గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఈ రెండ్రోజుల్లో షర్మిలను పీసీసీ చీఫ్గా నియమించే అవకాశముందని సమాచారం.