CM Revanth Reddy : వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో సీఎంతో పాటు.. మంత్రి శ్రీధర్ బాబుకు ఎన్ఆర్ఐలు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం ఇచ్చి.. శాలువా కప్పి సన్మానించారు. ఈ నెల 18 వరకు దావోస్లో
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు.
CM Revanth Reddy : వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో సీఎంతో పాటు.. మంత్రి శ్రీధర్ బాబుకు ఎన్ఆర్ఐలు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం ఇచ్చి.. శాలువా కప్పి సన్మానించారు. ఈ నెల 18 వరకు దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు.
ఇప్పటికే పలు కంపెనీ ప్రతినిధులను రేవంత్ రెడ్డి కలిశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న ప్రతికూల పరిస్థితులపై వివరించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వివరాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్కు తెలిపారు. తమ ప్రభుత్వం పెట్టబడిదారులకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తుందని రేవంత్ రెడ్డి వివరించారు.
ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరిగే అత్యున్నతస్థాయి సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రైతుల జీవనోపాధిని పరిరక్షించేందుకు వాతావరణానికి అనుగుణంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే అంశంపై ప్రసంగిస్తారన్నారు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేసిన ‘డెవలపింగ్ స్కిల్ ఫర్ ఏఐ’లో మాట్లాడనున్నారు. టెక్ కంపెనీలతో పాటు ప్రవాస భారత పారిశ్రామికవేత్తలను సీఎం కలుస్తారని తెలిపారు.