Vemulawada : తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. సంక్రాంతి పర్వదినం, పైగా సోమవారం కావడంతో పాటు మేడారం జాతరకు ముందు రాజన్నకే మొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల రద్దీ పెరిగింది. కల్యాణకట్ట, ధర్మగుండం పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా భక్తులు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పిస్తున్నారు. అనంతరం స్నానాలు ఆచరించి స్వామి వారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఆ తర్వాత రాజన్నను దర్శించుకుంటున్నారు.
Vemulawada : తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. సంక్రాంతి పర్వదినం, పైగా సోమవారం కావడంతో పాటు మేడారం జాతరకు ముందు రాజన్నకే మొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల రద్దీ పెరిగింది.
కల్యాణకట్ట, ధర్మగుండం పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా భక్తులు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పిస్తున్నారు. అనంతరం స్నానాలు ఆచరించి స్వామి వారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఆ తర్వాత రాజన్నను దర్శించుకుంటున్నారు.
వేముల వాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయం సమీపంలో బద్దిపోచమ్మ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఒక్క సారిగా ఆలయం కిక్కిరిసి పోయింది. మేడారం జాతర నేపథ్యంలో దుకాణాల్లో పెద్ద ఎత్తున బంగారం ( బెల్లం) కొనుగోళ్లు జరుగుతున్నాయి. వేములవాడ సమీపంలోని దుకాణాలు రద్దీగా మారాయి.