Basara : మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ఈ ఆలయం మహారాష్ట్ర సరిహద్దులో ఉండటంతో తెలుగువారితోపాటు మరాఠీలు ఎక్కువగా తరలివచ్చారు. కాగా,.. సంక్రాంతి సందర్భంగా ఇక్కడి మరాఠీలు చేతికొచ్చిన తమ పంటను మొదటగా బోనాలు రూపంలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ. దీంతో ఆలయంలో బోనాల సందడి కూడా నెలకొంది. ఇక రద్దీ కారణంగా అమ్మవారి దర్శనానికి కిలో మీటర్ మేర క్యూ కట్టారు భక్తులు.