Makara Jyothi : ఇవాళ అయ్యప్ప భక్తులకు మకర జ్యోతి దర్శన భాగ్యం కలగనుంది. జ్యోతి దర్శనార్థం కేరళలోని అయ్యప్ప మందిరానికి వేలాదిగా భక్తులు తరలివెళ్లారు. దీంతో శబరి కొండలు అయ్యప్ప నామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. సాయంత్రం 6.30 నుంచి 7.00 గంటల మధ్య ఈ జ్యోతి దర్శనం ఉంటుందని.. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని వ్యూ పాయింట్లను కూడా ఏర్పాటు చేశామని తెలిపింది. ఆలయ బోర్డు. ఈ సందర్భంగా స్వాములుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.
Makara Jyothi : ఇవాళ అయ్యప్ప భక్తులకు మకర జ్యోతి దర్శన భాగ్యం కలగనుంది. జ్యోతి దర్శనార్థం కేరళలోని అయ్యప్ప మందిరానికి వేలాదిగా భక్తులు తరలివెళ్లారు. దీంతో శబరి కొండలు అయ్యప్ప నామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. సాయంత్రం 6.30 నుంచి 7.00 గంటల మధ్య ఈ జ్యోతి దర్శనం ఉంటుందని.. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని వ్యూ పాయింట్లను కూడా ఏర్పాటు చేశామని తెలిపింది. ఆలయ బోర్డు. ఈ సందర్భంగా స్వాములుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.
ప్రతిఏటా మకర సంక్రాంతి రోజున శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. ఈ జ్యోతి దర్శనానికి అయ్యప్పస్వాములు తెలుగు రాష్ట్రాలకు సహా దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా పోటెత్తి వస్తుంటారు. మకర జ్యోతిని దర్శించుకుంటే తమకు మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు అయ్యప్పస్వాములు.
దీంతోనే మాలాధారణతో వెళ్లిన స్వాములు మకరజ్యోతిని దర్శించుకునేంత వరకు ఎదురుచూస్తారు. ఇక ఈసారి మకరజ్యోతిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు 50 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని ట్రావెన్కోర్ బోర్టు ప్రకటించింది. కానీ 4 నుంచి 5 లక్షల మంది వరకు మకర జ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం ఉండొచ్చని పలువురు అంచనా వేస్తున్నారు.