BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం మొగిలిపాడు జాతీయ రహదారిపై…. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రమాద స్థలంలోనే ఒకరు మృతి చెందగా…. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు…. రెండు బస్సుల్లో పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లారు.
BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం మొగిలిపాడు జాతీయ రహదారిపై…. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రమాద స్థలంలోనే ఒకరు మృతి చెందగా…. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు…. రెండు బస్సుల్లో పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పలాస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న మరో ట్రావెల్ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఆకాష్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు.