EPAPER

Ponnam Prabhakar : కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చెయ్యలేరు.. బండి సంజయ్‌కు మంత్రి పొన్నం కౌంటర్..

Ponnam Prabhakar : కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చెయ్యలేరు.. బండి సంజయ్‌కు మంత్రి పొన్నం కౌంటర్..

Ponnam Prabhakar : బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్ ఎంపీ వ్యాఖ్యల ద్వారా బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని.. ప్రజలందరికీ స్పష్టత వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసే ధైర్యం ఇతర రాజకీయ పార్టీలకు లేదని తేల్చి చెప్పారు. ఆరు గ్యారంటీల అమలుకు అడుగులు వేస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు అసహనానికి గురవుతోందని అన్నారు. కానీ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని స్పష్టం చేశారు. బీజేపీ ఢిల్లీలో మూడోసారి అధికారంలోకి బీఆర్ఎస్ రెండుగా చీలనుందని తెలిపారు.


ఇక అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఎన్నికల స్టంటేనని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాముడి కటౌట్లు అడ్డుపెట్టుకొని బీజేపీ ఓట్ల అడుగుతుందని.. జగద్గురు చెప్పినగానీ ఆశాస్త్రీయంగా రామమందిరాన్ని ప్రారంభిస్తున్నారని విమర్శించారు. లింగ ప్రాణప్రతిష్ఠ ఎవరు చేయ్యాలో తెలియదా.. ఇది అరిష్ఠం కాదా అని మంత్రి ప్రశ్నించారు. వైఫల్యం చెందిన ఎంపీల్లో బండిసంజయ్ నెంబర్‌వన్ అని అన్నారు. బండిసంజయ్ మాటలు జోతిష్యం చెప్పినట్టు ఉన్నాయని మంత్రి ఎద్దేవా చేశారు.

.


.

Related News

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

Big Stories

×