Sankranti Celebrations : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయిన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంబరాల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక జీవో పత్రాలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్ధానిక మహిళలు ఈ పోటీలలో పాల్గొని రంగవల్లులు వేశారు.
ఈ తెల్లవారుజామున భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటల కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.