Sankranti : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే పలుచోట్ల పందెం రాయుళ్లు బరిలోకి దిగారు. ఆకివీడు, నిడమర్రు మండలాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. తొలిరోజు నుంచే రూ. కోట్లల్లో నగదు చేతులు మారుతోంది. ఇక జంగారెడ్డిగూడెం మండలంలో కూడా కోడి పందేలు, గుండాట, జూదం జోరుగా సాగుతున్నాయి.
ఇక సీసలిలో కోడి పందేల్లో ఉండి ఎమ్మెల్యే రామరాజు, చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ కోడిపందేల కోసం ప్రత్యేకంగా మైదానం ఏర్పాటు చేశారు. క్రికెట్ మైదానాన్ని తలపించేలా పందేల వీక్షణకు గ్యాలరీ ఏర్పాటు చేశారు నిర్వాహకులు.