Sankranti Celebrations : సంకాంత్రి అంటే.. గోదావరి జిల్లాలు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే మొదట గుర్తొచ్చేది కోడి పందేలు. అందుకే.. కత్తులు దూసేందుకు కోళ్లు సిద్దంగా ఉన్నాయి. యుద్ద క్షేత్రాలుగా పందేల బరులు రెడీ అవుతున్నాయి. అసలుసిసలైన సంక్రాంతతి రణరంగం మొదలైంది. మూడు రోజులు పాటు జరగబోయే ఈ పందేలపై పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతాయి. దీని కోసం పందెం రాయుళ్లు సర్వం సిద్ధం చేశారు.
డే అండ్ నైట్ పందేలు జరిగే విధంగా ప్రత్యేక ఫ్లడ్ లైట్లు కూడా సిద్ధం చేశారు. ఈ మూడు రోజుల పాటు.. రేయింబవళ్లు.. 24 గంటలు నిర్విరామంగా పందేలు జరుగుతాయి. పిల్లలు, పెద్దోళ్లు అనే తేడా లేకుండా అందరూ బరుల చుట్టూ చేరుతారు. పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా.. పందెంరాయుళ్లు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని ఎలా వదులుకుంటామని చెబుతున్నారు.
ఇక.. సంక్రాంతి సంబరాలకు పట్టణాల వాసులంతా పల్లెలకు చేరడంతో.. పండుగ శోభ అంతా పల్లెల్లోనే కనిపిస్తోంది. ఉదయాన్నే పల్లెలు మేల్కొన్నాయి. సూరీడు రాకముందే.. వేసిన భోగిమంటలతో వెలుగొచ్చింది. డూడూ బసవన్నలు, హరిదాసులు, రంగురంగుల ముగ్గులు.. వాటి మధ్యలో గొబ్బిళ్లతో పల్లెలు కళకళలాడుతున్నాయి.
.
.