Vallabbhaneni Balashowry : ఇన్ఛార్జ్ల మార్పు వైసీపీలో నిరసన జ్వాలలకు ఆజ్యం పోసింది. ఇప్పటికే పలువురు నేతలు అధికార పార్టీకీ రాజీనామా చేశారు. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు.
బాలశౌరి గుంటూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డట్టు సమాచారం. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు. గతకొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత సీఎం జగన్కు పంపినట్టు ఎంపీ బాలశౌరి తెలిపారు.