EPAPER
Kirrak Couples Episode 1

Pakistan Occupied Kashmir | పివోకేలో బ్రిటీష్ రాయబారి పర్యటన.. అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

Pakistan Occupied Kashmir | పాకిస్తాన్‌లోని బ్రిటీష్ హైకమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి జేన్ మారియట్ జనవరి 10న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించింది. ఆమె పర్యటనపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అంశంపై ఢిల్లీలోని బ్రిటీష్ హై కమిషనర్ ఆఫీసులో జేన్ మారియట్ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారికంగా ఫిర్యాదు చేసింది.

Pakistan Occupied Kashmir | పివోకేలో బ్రిటీష్ రాయబారి పర్యటన.. అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

Pakistan Occupied Kashmir | పాకిస్తాన్‌లోని బ్రిటీష్ హైకమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి జేన్ మారియట్ జనవరి 10న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించింది. ఆమె పర్యటనపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అంశంపై ఢిల్లీలోని బ్రిటీష్ హై కమిషనర్ ఆఫీసులో జేన్ మారియట్ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారికంగా ఫిర్యాదు చేసింది.


“ఒక బ్రిటన్ రాయబారిగా జేన్ మారియట్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్‌పూర్‌లో పర్యటించడం.. భారత సార్వభౌమత్వాన్ని అవమానించడమే అవుతుంది. ఈ అంశాన్ని మేము సీరియస్‌గా పరిగణిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఆమోదయోగ్యం కావు. అందుకే ఢిల్లీలో బ్రిటన్ హై కమిషన్ కార్యాలయంలో జేన్ మరియట్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాం,” అని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. సోషల్ మీడియాలో కూడా జేన్ మరియట్‌కు వ్యతిరేకంగా హిందుత్వ కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు.

దీనిపై జేన్ మరియట్ స్పందిస్తూ.. ”70 శాతం బ్రిటీష్ పాకిస్తానీ పౌరులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతానికి చెందినవారే. బ్రిటన్, పాకిస్తాన్ ఇరు దేశాల సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించడానికే నేను మీర్‌పూర్ వెళ్లాను,” అని తెలిపింది.


ఇలాగే గత సంవత్సరం అక్టోబర్, డిసెంబర్ నెలల్లో అమెరికా అధికారులు పాకిస్తాన్‌లోని ముజఫరాబాద్, గిల్‌గిట్ బాలిస్తాన్‌లలో పర్యటించారు. అప్పుడు కూడా భారత ప్రభుత్వ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Pakistan Occupied Kashmir, Jane Marriott, British High Commission, Mirpur, India, Foreign Affairs, Diaspora,

Tags

Related News

Chiranjeevi : గిన్నిస్ రికార్డులో మెగాస్టార్ కి చోటు.. అమీర్ ఖాన్ చేతుల మీదుగా..!

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

World’s Tallest Bridges Guizhou: ప్రపంచంలోనే 100 ఎత్తైన వంతెనల్లో 49 ఒకే రాష్ట్రంలో.. ప్రకృతి ఒడిలో ఈ అందమైన బ్రిడ్జిలు ఒక్కసారైనా చూడాలి!

Gunfire in America: అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకీ.. నలుగురు మృతి

PM Modi Quad: ‘ప్రపంచవ్యాప్తంగా సర్వికల్ క్యాన్సర్‌తో పోరాటంలో భారత్ కీలక పాత్ర’.. 75 లక్షల డాలర్లు ప్రకటించిన ప్రధానీ మోదీ

Indian stuck in Foreign for 23 years: పరాయి దేశంలో 23 ఏళ్లుగా చిక్కుకుపోయిన భారతీయుడు.. ఎలా తిరిగొచ్చాడంటే..

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..

Big Stories

×