Sankranti Rush : సంక్రాంతి పండుగకు ప్రజలు సొంతూళ్లకు పయనమవ్వడంతో రహదారులన్నీ రద్దీగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. NH-65.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
విజయవాడ వెళ్లే వాహనాలు రాంగ్రూట్లో వెళ్లడంతో.. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే మార్గంలోనూ వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని లింగోజీగూడ నుంచి లక్కారం మధ్యలో రోడ్డుకు ఇరువైపుల సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
పోలీసులకు, హైవే నిర్వాహకులకు మధ్య సమన్వయం కొరవడటంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతోన్నారు. ఒక్క శనివారం రోజే NH-65పై 56 వేల వాహనాలు ప్రయాణించాయి.
.
.